అబిడ్స్, నవంబర్ 25: ఖమ్మం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య దారుణమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా టింబర్ డిపోలు మూసివేస్తున్నట్టు తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణయ్య తెలిపారు.
హైదరాబాద్లో జరిగిన ప్రత్యే క సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో హత్యకు గురైన ఫారెస్ట్ ఆఫీసర్ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అటవీ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని, హరితహారం విజయవంతానికి కృషి చేస్తున్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.