హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా నారట్పల్లి మండలంలో పులి కనిపించిందనే ప్రచారం వాస్తవం కాదని అటవీ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో పులి సంచారానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, పులి సంచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారులతో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎంసీ పర్గెయిన్ మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు. కొందరు పక రాష్ట్రాలకు చెందిన పులి సంచారం వీడియోలను ఈ ప్రాంతానికి చెందినదిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తలను నమ్మొద్దని అటవీ శాఖ అధికారులు కోరారు. రాష్ట్రంలో ఎకడైనా పులితోపాటు, వన్యప్రాణుల సంచారం తెలిస్తే టోల్ఫ్రీ నంబర్ 18004255364కు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ కోరింది.