న్యూఢిల్లీ : డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ డ్రగ్ 2డీజీ సాచెట్ రూ 990కు అందుబాటులో ఉండనుంది. పౌడర్ రూపంలో లభించే ఈ మందును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిస్కౌంట్ ధరపై సరఫరా చేస్తారు. 2డీజీ డ్రగ్ అత్యవసర వాడకానికి డీసీజీఐ ఇటీవల ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
కరోనా బారినపడి దవాఖానల్లో చికిత్స పొందే రోగుల్లో ఈ మందు వాడకం సత్ఫలితాలు ఇచ్చినట్టు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. 2డీజీ వాడిన రోగులు త్వరగా కోలుకోవడమే కాకుండా, వారికి ఆక్సజన్ అందించే అవసరం గణనీయంగా తగ్గినట్టు వెల్లడైంది. పౌడర్ రూపంలో తయారైన ఈ మందును నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఈ మందు శరీరంలోని వైరస్ కణాల్లోకి వెళ్లి వైరస్ మరన్ని కణాల్లోకి వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. ఆక్సిజన్ పై ఆధారపడి దవాఖానల్లో చేరాల్సిన రోగులకు ఈ మందు వరంగా మారనుంది.