TSRTC | హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించడానికి ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సవరించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఎక్స్పెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్లలోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా చార్జీని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30వసూలు చేయనుంది.
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముంద రిజర్వేషన్ మంచి స్పందన ఉందని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 15 వేల వరకు ముందస్తుగా ప్రయాణికులు టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తగ్గించామని చెప్పారు. ఈ వసతిని ప్రయాణికులంతా ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు