Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి రాకతో తెలంగాణలో కాంగ్రెస్ స్వరూపం మారిపోయింది. పార్టీ కాస్తా ‘పచ్చ’ కాంగ్రెస్గా మారిపోయింది. పీసీసీ చీఫ్ కాగానే తన ప్లాన్ను అమలు చేస్తూ వస్తున్న రేవంత్రెడ్డి పార్టీని నమ్ముకున్న పాతనేతలను వెళ్లగొట్టి పచ్చనేతలతో నింపేస్తున్నారు. కాంగ్రెస్ తప్ప మరో పార్టీ తెలియని పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడారు. తండ్రి హయాం నుంచి కాంగ్రెస్తోనే ఉంటున్న మర్రి శశిధర్రెడ్డి కూడా బయటకు వెళ్లిపోయారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు వచ్చిన పీ విష్ణువర్ధన్రెడ్డి కూడా కాంగ్రెస్కు రాంరాం చెప్పేశారు. కాంగ్రెస్తో ఏం సంబంధమూ లేని నేతలే ఇప్పుడా పార్టీలో ఉన్నారు.
రేవంత్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హన్మంతరావు, సీతక్క వంటి వారు పార్టీలోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తున్న విశ్లేషకులు కాంగ్రెస్ కాస్తా ‘పచ్చ’ కాంగ్రెస్గా మారిందనే అభిప్రాయానికి వచ్చారు. రేవంత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 మందికిపైగా అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు. వీరిలో పొన్నాల లక్ష్యయ్య, మర్రి శశిధర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, పాల్వాయి స్రవంతి, సంగిశెట్టి జగదీశ్వర్రావు, ఏలేటి మహేశ్వర్రెడ్డి, డీకే అరుణ, నందికంటి శ్రీధర్, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వంటీ సీనియర్ నేతలు ఉన్నారు. అదే సమయంలో 35 మందికిపైగా ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో సుమారు డజనుకు పైగా పాత టీడీపీ నేతలు ఉండడం గమనార్హం.
రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక పార్టీపై క్రమంగా పట్టుపెంచుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా సీనియర్లకు పొగపెట్టి వారి ప్రాధాన్యాన్ని తగ్గించే కుట్రకు తెరలేపారు. అవమానాలకు గురిచేసి ఎవరికి వారే స్వయంగా పార్టీని వీడేలా చేయడంలో విజయం సాధించారు. రేవంత్ తీరు నచ్చని మర్రి శశిధర్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, వీహెచ్ వంటి నేతలు పలుమార్లు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఓ దశలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు కూడా పార్టీ వీడతారన్న ప్రచారం జరిగింది.
టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రేవంత్ పాతమిత్రులను తీసుకొచ్చే ప్రణాళికను ముందే రచించి పెట్టుకున్నారు. టీడీపీ నేతలు సీతక్క, రమేశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణ, విజయరమణారావు, వేం నరేందర్రెడ్డి వంటి వారిని పార్టీలోకి తీసుకొచ్చారు.
పొన్నాల లక్ష్యయ్య, ఏలేటి మహేశ్వర్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, డీకే అరు ణ, నందికంటి శ్రీధర్, నాగం జనార్దన్రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, కొత్త మనోహర్రెడ్డి, సాజిద్ఖా న్, గండ్రత్ సుజాత, సుభాష్రెడ్డి, సంగిశెట్టి జగదీశ్వర్రావు, పీ విష్ణువర్ధన్రెడ్డి, సోహైల్ఖాన్, చెరు కు సుధాకర్, చెలమల కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్రెడ్డి, పటోళ్ల శశిధర్రెడ్డి, గంట రాములు, రాగిడి లక్ష్మారెడ్డి, జిట్టా బాలకృష్ణ, సంభాని చంద్రశేఖర్, పాల్వాయి స్రవంతి, మానవతారాయ్, సోమశేఖర్రెడ్డి, నగేశ్ ముదిరాజ్, కురువ విజయ్కుమార్.
సీతక్క, రమేశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణ, విజయరమణారావు, వేం నరేందర్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, ఏ చంద్రశేఖర్, బండి రమేశ్, రేవూరి ప్రకాశ్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, మండవ వెంకటేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మోత్కుపల్లి నర్సింహులు.