హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నిరుద్యోగుల బస్సు యాత్రకు ‘కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగుల బస్సు యాత్ర’ అని పేరు పెడితే బాగుంటుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో 1.65 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని, ఇంకా 85 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని వివరించారు.
నిరుద్యోగుల తరఫున ఉన్నది కేసీఆర్ మాత్రమేనని, రేపు ఉద్యోగాలను భర్తీ చేసేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని బస్సు యాత్రలు చేపట్టినా తెలంగాణ ప్రజలు అధికారం అప్పగించేది ముఖ్యమంత్రి కేసీఆర్కేనని తుంగ బాలు స్పష్టం చేశారు.