TSPSC | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు సరిగ్గా వారం రోజులే గడువు ఉండటంతో టీఎస్పీఎస్సీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. 2018లో 700 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) ఉద్యోగాలకు అత్యధికంగా 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత అంత భారీగా 9.51 లక్షల దరఖాస్తులు గ్రూప్-4కు మా త్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వారం రోజుల్లోనే మూడుసార్లు గ్రూప్-4 పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ సమావేశమైం ది. ఇదే విషయమై శుక్రవారం కూడా కమిషన్ సమావేశం జరిగింది. జిల్లాస్థాయి పోస్టులు కావడం, భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఈ సారి నియోజకవర్గ కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
పరీక్షల పర్యవేక్షణ, సిబ్బంది విధులు, పోలీసుల పటిష్ట బందోబస్తుతోపాటు అనేక విషయాలపై కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. టీఎస్పీఎస్సీ ఈ సారి గ్రూప్-4లో ప్రయోగాత్మకంగా థంబ్ అటెండెన్స్ తీసుకోవాలని యోచిస్తున్నది. బయోమెట్రిక్కు ఒక్కో అభ్యర్థికి సుమారు 30 నుంచి 40 సెకన్ల సమయం పడుతుంది. అదే థంబ్కి 5 నుంచి 10 సెకన్లలోనే పూర్తవుతుంది. ఇవన్నీ ఆలోచించిన కమిషన్ గ్రూప్-4లో థంబ్ అటెండెన్స్ను తీసుకోవడంపై స మాలోచనలు చేస్తున్నది. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులతో కమిషన్ చర్చలు జరిపింది. టెక్నీషియన్ల అభిప్రాయాలు స్వీకరించింది. గ్రూప్-4లో థంబ్ అటెండెన్స్కి సంబంధించి ఇప్పటికే కమిషన్ సూత్రప్రాయంగా ఓకే చెప్పేసినట్టు తెలిసింది.
నేటి నుంచి గ్రూప్-4 హాల్టికెట్లు
గ్రూప్-4 హాల్టికెట్లు శనివారం నుంచి https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వరకు వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జూలై 1వ తేదీన ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే రావాలని సూచించారు. హాల్ టికెట్ వెనక భాగంలో ముద్రించిన నియ మ నిబంధనలను అభ్యర్థులు తప్పక పాటించాలని సూచించారు.