శామీర్పేట, డిసెంబర్ 25 : రేణుక ఎల్లమ్మ ఆలయం(Ellamma temple)లో గుర్తు తెలియని దుండగులు(Thugs) చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఆలయ నిర్వాహకుల కథనం ప్రకారం వివరాలు.. శామీర్పేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆదివారం చోరికి పాల్గొడ్డారు. ఆలయంలోని సుమారు రూ.5 లక్షల నగదు(Gold), 3 తులాల బంగారు, 5 కిలోల వెండి వస్తువులు అపహరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.