ముంబై, డిసెంబర్ 29: ముంబైలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడిన ఇద్దరు దుండగులు ఉద్యోగులను తుపాకీతో బెదిరించారు. అడ్డుకొన్న ఓ ఉద్యోగిపై కాల్పులు జరుపడంతో అతను మరణించాడు. అనంతరం దుండగులు డబ్బుతో ఉడాయించారు. ఈ ఉదంతం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.