గాంధీ నగర్: నగరంలోని ట్యాంక్బండ్పై రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ట్యాంక్బండ్పై ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న మూడేండ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారి తల్లిదండ్రులు సహా కారు డ్రైవర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను యశోదా దవాఖానకు తరలించారు. రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. చిన్నారిని శ్రీగా గుర్తించారు. బాధితులను చిన్నారి తల్లిదండ్రులు సామన్య, శివకుమార్గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.