కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్ 29: ఆర్టీసీలో త్వరలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో రీజియన్కు కేటాయించిన 35 సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్, మానకొండూర్, చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో మంత్రి మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. అందులో భాగంగా డీజిల్ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు కాలుష్యనివారణకు 2,500 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయగా, వెయ్యి బస్సులు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. ఉద్యోగుల బకాయిలను దసరాలోగా బాండ్ల రూపంలో చెల్లిస్తామని పేర్కొన్నారు.