NEET | హైదరాబాద్ : దేశంలోని మెడికల్( Medical College ), బీడీఎస్( BDS ) కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2023( NEET UG 2023 ) ప్రవేశ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( National Testing Agency ) నోటిఫికేషన్ జారీ చేసింది. మే 7వ తేదీన నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అయితే ఈ ఏడాది తెలంగాణ( Telangana )లో మొత్తం 21 జిల్లా కేంద్రాల్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత ఏడాది 24 జిల్లా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఏడాది కుమ్రం భీం ఆసిఫాబాద్( Asifabad ), వికారాబాద్( Vikarabad ), మెదక్( Medak ) జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించట్లేదు. ఈ జిల్లాలకు చెందిన విద్యార్థులు తమ సమీప జిల్లా కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు.
దేశ వ్యాప్తంగా గతేడాది 543 పట్టణ కేంద్రాల్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది 485 పట్టణ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14 పట్టణాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తొలగించింది. నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.