వికారాబాద్ : జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను వికారాబాద్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 3 లక్షల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా డిగ్రీ చదువుతున్న శిఖరేష్, జాకీర్తోపాటు మరొకరు జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా రహదారి వెంట నిలిపి ఉంచిన భారీ వాహనాల నుంచి బ్యాటరీను చోరీ చేసి విక్రయిస్తున్నారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు చోరీలకు పాల్పడుతున్నట్లు ముగ్గురిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.