Students Drown | సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో చోటు చేసుకున్నది. శుక్రవారం సెలవుదినం కావడంతో విద్యార్థులు రామయ్య కాలనీలోని నీటికుంటలో ఈతకు వెళ్లారు. విద్యార్థులు అందులోనే మునిగి మృతి చెందారు. మృతులను విక్రమ్, ఉమామహేశ్ సాయిచరణ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.