హైదరాబాద్ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు వద్ద సాగర్ కాలువలో పంజాబ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్లుగా తెలుస్తున్నది. ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు, చెప్పులు కాలువ గట్టున స్థానికులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు వరికోత యంత్రంతో కట్టంకూరు వచ్చారు. అయితే, రాత్రి నుంచి తమవారు కనిపించడం లేదని పంజాబ్ వాసుల వెల్లడించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్థానికుల సహకారంతో పోలీసులు సాగర్ కాలువలో వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.