Khammam | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టాపురం వద్ద అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను సిద్దేశీజాయ్ (18), సాదిక్ (16), శశి (12)గా గుర్తించారు. చంద్రుగొండ నుంచి సత్తుపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.