Road Accident | నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఎనిమిదికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం డీసీఎం డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.