హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్ వద్ద ఓ ఇద్దరు పిల్లలతో కలిసి డ్రైవర్ దంపతులు స్నానం కోసం గోదావరిలో దిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ఓ బాబును రక్షించారు. మిగతా ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
గల్లంతైన వారిని చంద్రుగొండ మండలానికి చెందిన ఆటోడ్రైవర్ నరసింహరావు, తల్లి రిహానా, ఆమె కుమారుడు ఇర్ఫాన్గా గుర్తించారు. మరో కుమారుడు ఇమ్రాన్ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని పడవ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తుండగా.. చీకటిపడడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.