మెదక్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న దంపతులు సహా ఏడాది వయస్సున్న ఓ బాలుడు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మృతులను ఎండీ గౌస్, ఆలీ (45), అజీం బేగం (40)గా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో చిన్నారులు సహా తొమ్మిది మంది ఉన్నారని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.