నిజామాబాద్/హనుమకొండ: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని భీంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. భీంగల్ వద్ద కారుపై ఓ జేసీబీ (JCB) పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న ఇద్దరిని బయటకుతీసి దవాఖానకు తరలించారు. బాధితులను మోర్తాడ్కు (Morthad) చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో హనుమకొండ (Hanamkonda) జిల్లా పరకాల (Parakala) సమీపంలోని చలివాగు (Chalivagu) వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం (Warangal MGM) దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.