హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
మూడు రోజుల సెలవుల పాటు సెలవులు ఇచ్చింది. సోమవారం నుంచి బుధవారం సెలవులు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.