రాంనగర్/తిమ్మాపూర్ రూరల్/ కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 7: హోలీ జరుపుకున్న ముగ్గురు బాలురు.. స్నా నానికి వాగులోకి వెళ్లి నీట ము నిగి మృత్యువాత పడ్డారు. క రీంనగర్ శివారులోని మానేరు వాగులో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. వ్యక్తిగతంగా మరో రూ.2 లక్షలు అందజేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెం దిన బత్తిని వీరాంజనేయులు(16), గోనెపల్లి సంతోష్(13), వల్లెపు అనిల్(14) తల్లిదండ్రులు తాపీ మేస్త్రీలుగా పనిచేసుకుం టూ హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వీరాంజనేయులు టెన్త్, సంతోష్, అనిల్ 8వ తరగతి చదువుతున్నారు. హోలీ జరుపుకున్న వీరు.. మధ్యాహ్నం అల్గునూర్ మానేరు బ్రిడ్జి, తీగల వంతెన మ ధ్యలో రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న స్థలంలో వాగులో స్నానం చేయడానికి దిగారు. ఈత రాకపోవడంతో నీట మునిగి అక్కడికక్కడే మృతిచెందారు. వారితో ఉన్న మరో స్నేహితుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇలాగే వికారాబాద్ జిల్లాలోని పాత తాండూరు కాగ్నానదిలో ఈతకు వెళ్లి మల్రెడ్డిపల్లికి చెందిన వీరన్న, మాధవి దంపతుల కొడుకు ప్రదీప్ (19) మృతి చెందాడు.