హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : పాత పెన్షన్ను పునరుద్ధరించే రాష్ర్టాలను కేంద్రప్రభుత్వం బెదిరించడమేమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమ మాట వినని రాష్ర్టాలకు అదనపు రుణాలు ఇవ్వబోమని ప్రకటించడం అత్యంత దారుణమని పేర్కొన్నాయి. కేంద్రం తీరు అప్రజాస్వామికంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే రాష్ర్టాలకు అదనపు రుణాలు ఇచ్చేది లేదని కేంద్రం 202324 ఆర్థిక సంవత్సర సర్క్యులర్పై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. కేంద్ర తన తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించాయి. ఉద్యోగుల శేష జీవితాలకు సంబంధించిన పెన్షన్లను కూడా అమానవీయంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలతో ముడిపెట్టడం దుర్మార్గ వైఖరికి నిదర్శనమని విమర్శించాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మరో ప్రభుత్వం బెదిరించడం సరికాదని, కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సామాజిక భద్రత, సంక్షే మం కోరి రాష్ర్టా లు పాత పెన్షన్ ది శగా అడుగులేస్తున్నాయి. ఈ తరుణంలో ఆర్థికంగా సహకరించాల్సిన కేం ద్రం ఆంక్షలు విధించడం దారుణం. కేం ద్రం పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దుచేయకపోగా, రాష్ర్టాలకు అడ్డుపుల్ల వేయడం అ ప్రజాస్వామికం. ఉద్యోగుల డబ్బులతో అదానీ లాంటి వాళ్ల షేర్లల్లో పెట్టుబడి పెట్టగా, వారే బిలియనీర్లు అవుతున్నారే తప్ప, ఉద్యోగులకు మిగిలేదేం లేదు. అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తున్నాం.
-స్థితప్రజ్ఞ, ఎన్ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్
నూతన పెన్షన్ విధానంలో ఉంటేనే రుణా లు ఇస్తామని రాష్ర్టాలపై ఆర్థిక ఆంక్షలు విధించడం అత్యంత హేయం. కేంద్రం అవలంబిస్తున్న బ లవంతపు ఆంక్షలను ఖండిస్తున్నాం. పాత పెన్షన్ను పునరుద్ధరించిన రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఇచ్చే రుణాలను 3 శాతానికి తగ్గించే నిబంధన పెట్టి సీపీఎస్ ఉద్యోగుల హక్కులను కేంద్రం అడ్డుకొంటున్నది. కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ వాటా రూ.16 వేల కోట్లను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తే ఊరుకోం.
– దాముక కమలాకర్, సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ర్టాలకు రుణాలు, అదనపు రుణాలివ్వబోమంటూ కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తున్నది. ఇది రాష్ర్టాలపై కక్ష సాధింపు చర్యలుగా భావిస్తున్నాం. నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) వైపు అడుగులేస్తున్న రాష్ట్రాలకు అడ్డుకట్టేవేసేందుకే ఇలాంటి కుట్రలకు కేంద్రం పాల్పడుతున్నది. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
-హన్మాండ్ల భాస్కర్,తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి