బంజారాహిల్స్, జనవరి 3: బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్కు బెదిరింపు కాల్స్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. షేక్పేట సమీపంలోని ఆదిత్య ఎంప్రెస్ పార్క్లో నివాసముంటున్న దాసోజు మొబైల్ ఫోన్కు గత నెల 6న రెండు గుర్తుతెలియని నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
దుర్భాషలాడటంతోపాటు అంతు చూస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్స్ చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల దాసోజు శ్రవణ్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఆనుమతి తీసుకున్న పోలీసులు బుధవారం ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.