హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్లో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ పటిష్టతతో పాటు తదితర అంశాలపై చర్చించారు. తనను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించినందుకు మరోసారి సీఎం కేసీఆర్కు తోట చంద్రశేఖర్ ప్రత్యేక కృతజ్జతలు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఏపీ నేత చింతల పార్థసారథి తదితరులున్నారు.
ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ నెల 2వ తేదీన భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు టీజే ప్రకాశ్(అనంతపురం), తాడివాక రమేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్ నాయుడు(కాపునాడు, ప్రధాన కార్యదర్శి), రామారావు(ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు) కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.