హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ):ఈవీ చా ర్జింగ్ నెట్వర్ సంస్థ బోల్ట్.. ఇంట్లోనే ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ చేసుకునే పరికరాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో మొట్ట మెదటి సురక్షితమైన యూనివర్సల్ ఈవీ చార్జింగ్ సాకెట్ ఇదేనని పేర్కొంది. ఈ సందర్భంగా బోల్ట్ కో-ఫౌండర్ మోహిత్ యాదవ్ మాట్లాడుతూ..దేశీయంగా తయారవుతున్న ఈ సాకెట్ ఏదైనా ఈవీతో వచ్చే అన్ని పోర్టబుల్ చార్టర్లతో పాటు, ముఖ్యంగా ఇంట్లోని ఏసీ పవర్ సైప్లెతో ఇది పనిచేస్తున్నదన్నారు. ఈ సాకెట్లు రూ.2,599 ప్రారంభ ధరతో లభించనున్నాయన్నారు. దేశంలో 300 నగరాల్లో 15,000 బోల్ట్ చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయడంతో ఈవీల పబ్లిక్ చార్జింగ్ సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇటీవల ఈవీ బ్యాటరీల్లో మంటలు చెలరేగడం చూస్తున్నామని, బోల్జ్ లైట్ ఈవీతో బ్యాటరీల్లో ప్రమాదాలు నివారించగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.