Medaram Jathara | జంపన్న వాగులో స్నానాలు.. తలనీలాలు.. నిలువెత్తు బంగారం.. ఎదుర్కోల్లు, మేకపోతులు.. ఓడిబియ్యం.. చీరసారెలు.. శివసత్తుల పూనకాలు.. కోయరాజుల జాతకాలతో.. కోరుకున్న వారికి కొంగుబంగారమై నమ్మకమే భక్తిగా నడిపించే జాతర.. మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ తెలంగాణ కుంభమేళ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇవాల్టి నుంచి జాతర ప్రారంభం కావడంతో కార్లు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఎడ్ల బండ్లలో మేడారం జాతరకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు వాహనాల్లో వెళ్లిన దానికంటే కూడా ఆర్టీసీ బస్సుల్లో వెళ్తేనే బెటర్ అని టీఎస్ఆర్టీసీ చెబుతోంది. ఈ జాతరకు కార్లలో, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్లే వాళ్లు కేవలం పార్కింగ్ దాకానే వెళ్తారు.. అదే ఆర్టీసీ బస్సులో వెళ్తే.. సరాసరిగా అమ్మవార్ల గద్దెల దాకా వెళ్లొచ్చని చెబుతోంది.
ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే కలిగే లాభాల గురించి వివరిస్తూ టీఎస్ఆర్టీసీ ఒక వీడియోను షేర్ చేసింది. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి 6వేల ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లుగా వివరించింది. ఆర్టీసీ బస్సులో వెళ్లండి.. అమ్మవార్ల గద్దెల దాకా క్షేమంగా వెళ్లొచ్చు.. మంచిగ దర్శనం చేసుకుని.. అదే బస్సులో తిరిగి క్షేమంగా రావచ్చని భక్తులకు సూచించింది.
మేడారం జాతరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే పార్కింగ్ వరకే.. అదే ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే అమ్మవార్ల గద్దెలకు దగ్గరగా!@TSRTCHQ @PROTSRTC @tsrtcmdoffice @PonnamLoksabha @TelanganaCMO pic.twitter.com/TLrzwfk8O3
— PRO, TSRTC (@PROTSRTC) February 21, 2024