న్యూఢిల్లీ: తాను కడిగిన ముత్యంలో బటయకు వస్తానని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని విమర్శించారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు అప్రూవర్గా మారాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు ఇచ్చాడు. తాను ఏ తప్పూ చేయలేదని, అప్రూవర్గా మారేది లేదని స్పష్టం చేశారు. క్లీన్గా బయటకు వస్తానని చెప్పారు. నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు
ఒక నిందితుడు బీజేపీలో చేరాడు.. ఒక నిందితుడు బీజేపీ నుండి టికెట్ పొందాడు.. ఒక నిందితుడు బీజేపీకి 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చాడు.
కడిగిన ముత్యంలా బయటకు వస్తా.. అప్రూవర్గా మారేది లేదు – ఎమ్మెల్సీ కవిత pic.twitter.com/1VJd7a48Ra
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2024
#WATCH | Delhi | BRS leader K Kavitha brought to Rouse Avenue court at the end of her ED custody in Delhi excise policy money laundering case, she says, “This is not a money laundering case but a political laundering case. It is a fabricated and false case. We will come out… pic.twitter.com/HEKN6hQsrB
— ANI (@ANI) March 26, 2024