వర్ని, ఆగస్టు 24: అధికార దా హంతో కొందరు రాష్ట్రంలో అశాం తి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా వర్నిలో స్పీకర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, అశాంతి నెలకొల్పేందుకు కొందరు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, అల్లర్లు చేసేవారు ఎంతటివారైనా ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. పోలీసులు శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఎవరిపైనైనా కేసులు నమోదు చేస్తారని చెప్పారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.