హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలోభాగంగా మూడో రోజు మున్నూరు రవి, మధుసూదన్రాజును ప్రశ్నించారు. చివరి రోజు శనివారం సైబరాబాద్ పోలీసులు కీలక విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. ప్రధాన నిందితుడు రాఘవేందర్రాజుతో పాటు మరో ఇద్దరిని శనివారం ఒకేదగ్గర కూర్చోబెట్టి మరికొన్ని ప్రశ్నలను సంధించనున్నట్టు తెలిసింది.