CM KCR | నియోజకవర్గ, రాష్ట్ర భవిష్యత్ను, తలరాతను మార్చేదే ఓటు అనే ఆయుధమని.. దాన్ని ఆషామాషీగా వేయొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మహబూబ్నగర్కు ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో నేను ఇక్కడి నుంచే
పోటీ చేశాను. మీరందరూ కూడా ఏ ఊరు, ఏ ఏ పల్లె అని చూడాకుండా తెలంగాణనే ఇయన గ్రామం అని
భావించి నన్ను పెద్ద మెజారిటీతో ఎంపీగా గెలిపించారు. మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ
రాష్ట్రం మనకు సిద్ధించింది. ఆ గౌరవం, ఈ కీర్తి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా
ఉంటుంది. మీరందరూ చైతన్యవంతులు. ఈ పట్టణంలో విద్యాధికులు ఎక్కువ ఉన్నరు’ అన్నారు.
‘భారతదేశంలో 75 సంవత్సరాల తర్వాత కూడా రాజకీయాల్లో రావాల్సినంత పరిణితి రాలేదు. ఏ దేశాల్లో ఐతే వచ్చిందో వాళ్లు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నరు. మనదగ్గర ఎన్నికలు వచ్చాయంటే అడివడివి గత్తర గత్తర. నేను చెప్పే నాలుగు మాటలపై బస్తీలు, గ్రామాల్లో చర్చ పెట్టాలి. రాయేదో రత్నమేదో గుర్తించండి. ప్రజాస్వామ్యంలో ఉండేది. ప్రజల దగ్గర ఉండేది, విలువైన ఆయుధం మీ ఓటు. అది మామూలు ఓటు కాదు. వచ్చే ఐదు సంవత్సరాల కోసం.. మహబూబ్నగర్ నియోజకర్గ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తును, మీ తరలరాతను మారుస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేస్తేనే మేలు జరుగుతుంది. ప్రజలు ఎన్నికల్లో అభ్యర్థి గురించి విచారించాలి. అంతకంటే ముఖ్యంగా అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర, సామాజిక దృక్పథం, నడవడిక ఏంటీ చూడాలని మనవి చేస్తున్నా. ఇవన్నీ గమనంలో పెట్టుకోవాలని కోరుతున్నా’నన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ కోసం మడమ తిప్పకుండా పేగులు తెగేదాక.. తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి పదిహేనేళ్లు పోరాటం చేసి తెలంగాణను బీఆర్ఎస్ సాధించింది. కాంగ్రెస్ 50 ఏళ్లు, ఈ రాష్ట్రాన్ని పాలించింది. మన తెలంగాణకే ఉండే.. దాన్ని ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. 58 సంవత్సరాల పాటు మనల్ని ఏడిపించారు. అనేక కరువులకు గురి చేసింది. పాలమూరు జిల్లాను బొంబాయి బస్సులకు ఆలవాలం చేశారు. మంచినీళ్లు ఇవ్వలేదు. సాగునీరివ్వలేదు. కరెంటు ఇవ్వలేదు. చేనేత కార్మికుల ఆకలి చావులు. రైతుల ఆత్మహత్యలు, వలసలు. ఇది మన బతుకు కాంగ్రెస్ రాజ్యంలో. 1969లో ఉద్యమం వస్తే 400 మందిని పిట్టల్ని కాల్చి చంపినట్లుగా చంపారు. మనం మొదలుపెట్టినప్పుడు 2004లో తెలంగాణ ఇస్తాం.. పొత్తుగలుస్తామని వచ్చారు. సంతోషమని కలిశాం. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం వచ్చింది. 205-2006లో తెలంగాణ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. మళ్లీ దోఖా మొదలుపెట్టారు’ అంటూ విమర్శించారు.
‘శ్రీనివాస్గౌడ్ గెజిటెడ్ మున్సిపల్ కమిషనర్గా ఉండే. అతను కూడా రాజీనామా చేసి ఉద్యమంలో దుంకే
పరిస్థితి కల్పించారు. ఉద్యోగులు రోడ్లమీదకు బాటపట్టే పరిస్థితి కల్పించారు. అనేక మంది పిల్లలకు చావుకు
కారణమయ్యారు. చివరకు నాకు తిక్కపుట్టి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష పెడితే
33 పార్టీలు మద్దతు ఇస్తే తప్పదురా అని తెలంగాణ కోసం వచ్చారు. ఇదే ఆ పార్టీ చరిత్ర. పది
సంవత్సరాలుగా మీ ఆశీర్వచనంతో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్. ఏం చేశామో ఆలోచన చేయాలి.
మొదట పేదల సంక్షేమం చేశాం. పెన్షన్లు పెంచుకున్నాం. రాష్ట్ర సంపదను పెంచి రూ.2వేలకు పెంచాం. ఈ
సారి గెలిస్తే రూ.5వేలకు తీసుకుపోతాం. కల్యాణలక్ష్మి, షాదీముభారక్, కంటి వెలుగు ఇలా ఎన్నో పథకాలను
తీసుకువచ్చాం. అమ్మ ఒడి వాహనాలను తీసుకువచ్చాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు బంద్ చేసేందుకు అమ్మ ఒడి వాహనాలు పెట్టాం. అమ్మాయిలు గర్భవతులు అయితే ఆ వాహనంలో తీసుకెళ్లి, పరీక్షలు చేసి ఫ్రీగా మందులు ఇస్తున్నాం. ప్రసవం సమయంలో తీసుకెళ్లి ప్రసవం చేయిస్తున్నాం. అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇచ్చి.. ఫ్రీగా మళ్లీ ఊరిలో దించుతున్నాం. అనేక సంక్షేమ
కార్యక్రమాలు తీసుకువచ్చాం’ అన్నారు.
‘తెలంగాణ వచ్చిన నాడు చెట్టుకొకరం గుట్టొకరం అయినం.. వలస పక్షులమైన కాబట్టి పేద ప్రజలను ఆదుకోవాలని సంక్షేమ కార్యక్రమాలను తీసుకున్నాం. రైతుల కోసం పథకాలను తీసుకువచ్చాం. సాగునీటికి అన్ని రాష్ట్రాల్లో పన్ను వసూలు చేస్తూ మన రాష్ట్రంలో రద్దు చేశాం. 24 గంటలు ఫ్రీ కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. రైతులు సాగు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది. అలాగే రైతుబీమాను తీసుకువచ్చాం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని.. రైతులు నిలదొక్కుకోవాలని ఈ కార్యక్రమాలు అమలు చేశాం.
ఈ రోజు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు ఇచ్చి ప్రజల పన్నులను దుబారా చేస్తున్నడని మాట్లాడుతున్నరు. శ్రీనివాస్గౌడ్ను గెలిపిస్తే రైతుబంధును రూ.16వేలు చేస్తాం. పీసీసీ అధ్యక్షుడు 24గంటల కరెంటు వేస్ట్.. మూడు గంటలు చాలు అంటున్నడు. మరి మూడు గంటల కరెంటు కావాలా.. 24 గంటల కరెంటు కావాలా?. శ్రీనివాస్ గౌడ్ గెలిస్తేనే ఉంటది. లేకపోతే దాన్ని కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోతుంది. ఎట్ల పారుతుందంటే మూడుగంటల కంటే.. 10హెచ్పీ మోటర్ పెట్టుకోవాలట. పది హెచ్పీల మోటర్లు పెట్టాలంటే 60వేలకోట్లు కావాలి. కాంగ్రెసోని అయ్య ఇస్తడా? ఆలోచితంగా మాట్లాడుతున్నరు. వాళ్లు ఉన్న నాడు కరెంటు ఇవ్వలేదు. రాత్రి, పొద్దాక కొంత ఇస్తే పాములు, తేళ్లు కరిచి, షాకులు కొట్టి అనేక మంది చనిపోయారు. వాళ్లకు చేతకాలేదు. తెలివి లేదు. ఇచ్చేటోడు వస్తే దాన్ని కూడా ఎటమటం చేయాలని మాట్లాడుతున్నది’ అంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు.