కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో దొంగలు (Thieves) హల్చల్ చేశారు. మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారు. గ్రామంలోని రెండు వైన్ షాపులు, బంగారం దుకాణం, మెడికల్ షాప్లను దొంగలు లూటీచేశారు. షాపులలో భారీగా నగదు ఎత్తుకెళ్లారు. షాపులకు తాళాలు పగులకొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.