హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో దొంగలు బీభత్సం సృష్టించారు. జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 78లో ఉన్న ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. గురువారం రాత్రి కాంట్రాక్టర్ ఇంట్లోకి చొరబడిన దుండగులు 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.