జగిత్యాల: జిల్లాలోని మెట్పల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి పది దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం రాత్రి మెట్పల్లిలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న 10 షాపుల్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అన్ని దుకాణాల్లో కలిపి మొత్తం రూ.10 లక్షలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.