భీమారం, మార్చి 17 : మంచిర్యాల జిల్లా భీమారం(Bhimaram) మండల కేంద్రంలోని గోదాంలో ధాన్యం దొంగతనం(Thieves) జరిగింది. హాజీపూర్ మండల కేంద్రంలోని దుర్గ ఇండస్ట్రీకి చెందిన 2022-23 సీజన్కు సంబంధించిన వడ్లను( Grain) సంచుల్లో నింపి ఇక్కడి గోదాంలో నిల్వ ఉంచారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోదాం తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు 40 క్వింటాళ్లు ఎత్తుకెళ్లారు.
అదే సమయంలో స్థానికులు అటువైపుగా రావడంతో 52 సంచులను వదిలి పరారయ్యారు. ఆపై స్థానికులు దుర్గ ఇండస్ట్రీ యాజమాని దర్శనాల రమేశ్కు సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, గుర్తు తెలియని దొంగలు టాటాఏస్ వాహనంతో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.