నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంతోపాటు పక్కనే ఉన్న మాదాపూర్ గ్రామంలో దుండగులు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇండ్లు, వ్యాపార సముదాయాలు లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. మాదాపూర్లో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉన్న ఓ ఇంటి తాళాలు బద్దలుకొట్టి.. బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా ఓ వైన్స్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఇటీవల ఇదే మండలంలోని ముల్లంగి అనే గ్రామంలో 11 ఇండ్లలో దొంగతనాలు జరిగాయి. నిన్న రాత్రి మరోసారి చోరీలు వెలుగు చూడటం గమనార్హం.