భువనగిరి: భువనగిరి మండలం మస్వాలపల్లిలో దోంగలు హల్చల్ చేశారు. బుధవారం రాత్రి గ్రామంలోని మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు రూ.5.5 లక్షలు, 16 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఒక ఇంట్లో రూ.5 లక్షలు, పది తులాల బంగారం, మరో ఇంట్లో రూ.40 వేలు, ఆరు తులాల బంగారం, మూడో ఇంట్లో రూ.10 వేలు ఎత్తుకెళ్లారు. ఇండ్లలో దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. చోరీ ఘటనలపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.