ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లా కేంద్రంలో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. ఇంటికి తాళాలు వేసి వెళ్తే చాలు.. దొంగలు ఇండ్లను గుల్లా చేసున్నారు. ఖమ్మం పట్టణం కవిరాజనగర్(Kavirajanagar)లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు దొంగతనానికి(Theft) పాల్పడారు.
ఇండ్లలో ఉన్న 15 తులాల బంగారం, 67 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడంతోనే దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని, గట్టి నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.