జగిత్యాల : జగిత్యాల పట్టణం(Jagithyala town)లో దొంగలు(Thieves) హల్చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇండ్ల లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని బ్రహ్మణవాడలో దొంగలు పలు ఇండ్లలో చోరీకి పాల్పడి బీరువాల్లో ఉన్న 8 తులాల బంగారం(Gold), రూ.60 వేల నగదు, సీసీ కెమెరాలు, డీవీఆర్ను సైతం ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా విచారణ జరుపుతున్నామని పట్టణ సీఐ నటేష్ తెలిపారు. ప్రజలు ఏదైనా ఊరెళ్లటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసుల గస్తీని పెంచి త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు.