యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రోజుకో ఊరిలో చైన్ స్నాచింగ్లకు(Chain snatching) పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో రెండు చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు.
ఆరుబయట నిద్రిస్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఆరుబయట నిద్రిస్తున్న శిరీష అనే మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు , మాధవి అనే మరో మహిళ మెడలోంచి రోల్డ్ గోల్డ్ పుస్తెల తాడు, 25 గ్రాముల బంగారు పుస్తెలను ఎత్తుళ్లారు. పోలీసులు గస్తీని పెంచి దొంగల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.