నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో బ్యాంకు చోరికీ యత్నించిన దొంగను (Thief) పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు. అయితే సైరన్ రావడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన స్థానికులు బ్యాంకు ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో బయటకు రావడానికి మరో దారిలేక అక్కడే ఉండిపోయాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాంకు లోపల ఉన్న దొంగను అరెస్టు చేశారు.