హైదరాబాద్: మేడ్చల్లో ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని వివేకానంద సెంటర్లో ఉన్న ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు.. చోరీకి యత్నించారు. అయితే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా రావడంతో అక్కడినుంచి పరారయ్యారు. గుర్తించిన పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తిలోని గంగదేవమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుడి తలుపులు పగలగొట్టి సామగ్రి బయటపడేశారు. హిండీలోని రూ.లక్ష నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.