కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నాలుగు ఆలయాలు, ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీమార్కెట్లో ఉన్న రాజరాజేశ్వరాలయం, ముత్యాల పోచమ్మ, మత్తడి పోచమ్మ ఆలయాలు, ఓ షాపులో గుర్తుతెలియని వక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్లో ఉన్న ఎల్లమ్మ ఆలయంలోనూ చోరీచేశారు. ఆలయాల తలుపులు ధ్వంసం చేసి హుండీలు ఎత్తుకెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.