హైదరాబాద్: నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని బాటసింగారంలో తాళాలు వేసిఉన్న ఇండ్లే లక్ష్యంగా దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా తొమ్మిది ఇండ్లలో నగదు, బంగారం, వెండి నగలు దోచుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.