ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: వ్యవసాయ యూనివర్సిటీ భూములను పాలకుల స్వలాభం కోసం ధారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు హెచ్చరించారు. వర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక్కడి భూముల్లో అరుదైన ఔషధ మొక్కలు ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని ధ్వంసం చేసి, వ్యవసాయ పరిశోధనలు నిలిచిపోయేలా కుట్ర జరుగుతున్నది ఆరోపించారు. భూములను కాజేసి, వర్సిటీని భ్రష్టు పట్టించాలని చూస్తే విద్యార్థి లోకం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. హైకోర్టు నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని, వర్సిటీ భూములను లాక్కోవడాన్నే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.