బాన్సువాడ టౌన్, జూలై 19 : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిందని కొన్ని న్యూస్ చానళ్లలో స్క్రోలింగ్ వస్తున్నదని, అది అంతా అబద్ధమని వారు పేర్కొన్నారు.
బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలోనే ఉన్నారని, వారు ఎలాంటి పర్యటనకు వెళ్లలేదని.. బాన్సువాడ పట్టణంలో జరిగిన వాహన ప్రమాదానికి స్పీకర్ కాన్వాయ్కి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.