హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఎకడా కొరత లేదని చమురు మారెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరాను ప్రభుత్వరంగ ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెల్లడించారు.
ఈ నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధి నమోదయినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల ఆదివారం వరకు మొత్తం 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేశామని, ఈ సీజన్కు ఇది సాధారణం అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై అసత్యవార్తలు, వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు.