Telangana | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈసారి ఉప ఎన్నికలకు అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డిలో పోటీకి దిగారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొడంగల్తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేశారు. మరోవైపు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ హుజూరాబాద్తోపాటు గజ్వేల్లోనూ కేసీఆర్పై పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో వీరిలో ఏ ఒక్కరు రెండుచోట్ల గెలిచినా తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయని అందరూ భావించారు.
అనూహ్యంగా ముగ్గురిలో ఎవరూ రెండుచోట్ల గెలవలేదు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. అక్కడ రేవంత్రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. కొడంగల్లో రేవంత్రెడ్డి, గజ్వేల్లో కేసీఆర్ విజయం సాధించారు. బీజేపీ నుంచి హుజారాబాద్, గజ్వేల్లో పోటీచేసిన ఈటల రాజేందర్ రెండుచోట్లా ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి రాష్ట్రంలో ఎక్కడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకుండాపోయింది.