జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతున్నది. అధికారంలోకి వచ్చి నెలరోజుల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాపల్లి (Jayashankar bhupalapalli) కలెక్టరేట్ను పలు దళిత సంఘాలు ముట్టడించాయి. ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే దళిత బంధు ఇవ్వాలని, పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రౌండింగ్ను పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని అమలు చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.