హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని అడిషనల్, జాయింట్, డిప్యూటీ, అసిస్టెంట్ స్థాయి కమిషనర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ ఇన్కం ట్యాక్స్ కమిషనర్ (అడ్మిన్, టీపీఎస్) కే రవికిరణ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
52 మంది అడిషనల్, జాయింట్ కమిషనర్లను ట్రాన్స్ఫర్ చేశారు. 62 మంది డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. వారందరూ వెంటనే ఆయా స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.